హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తుంది. దీంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ రోహ్తంగ్ పాస్లో భారీగా మంచు కురుస్తోంది. అటల్ టన్నెల్, కులు-మనాలీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
పోటెత్తిన పర్యాటకులు...
ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. వాహన దారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.