ఓ మనిషి మరో మనిషిని లాగడమేంటి.? చేతి రిక్షాల వాడకంపై 'సుప్రీం' దిగ్భ్రాంతి..!

హ్యాండ్‌లాడ్ రిక్షాల వాడకంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Update: 2025-08-07 03:07 GMT

హ్యాండ్‌లాడ్ రిక్షాల వాడకంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మథేరాన్‌లో ఈ అమానవీయ ఆచారాన్ని ఆరు నెలల్లోగా నిలిపివేయాలని, దాని స్థానంలో ఈ-రిక్షాలను తీసుకురావాలని సుప్రీంకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇటువంటి పద్ధతుల‌ను అనుమతించడం సామాజిక, ఆర్థిక న్యాయం వంటి రాజ్యాంగ వాగ్దానాల‌ను బలహీనపరుస్తాయ‌ని.. ఇది మానవ గౌరవానికి సంబంధించిన ప్రాథమిక భావనకు విరుద్ధమ‌ని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె. జస్టిస్ వినోద్ చంద్రన్, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పాటు మథేరన్‌లో హ్యాండ్‌లాడ్ రిక్షాలను పూర్తిగా నిషేధించాలని ధర్మాసనం ఆదేశించింది.

గుజరాత్ అధికారులు కేవడియాలో చేసినట్లుగా, మాథేరన్‌లో స్థానిక ప్రజలకు ఈ-రిక్షాలను అద్దెకు ఇచ్చే అవకాశాలను అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చిన‌ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చేతితో లాగించే రిక్షాలను ఉపయోగించే విధానాన్ని ధర్మాసనం ఖండించింది. ఇది అమానవీయమని అభివర్ణించింది.

Tags:    

Similar News