నిన్న సీఎం.. నేడు మాజీ ముఖ్య‌మంత్రి.. రజనీకాంత్ వ‌రుస భేటీలు

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను నటుడు రజనీకాంత్‌ వ్యక్తిగతంగా కలిశారు.

Update: 2023-08-20 09:49 GMT

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను నటుడు రజనీకాంత్‌ వ్యక్తిగతంగా కలిశారు. జైలర్ విడుదల త‌ర్వాత‌ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల‌ను సంద‌ర్శించి పూజలు చేసిన రజనీకాంత్.. వరుసగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌లను కలిశారు.

ఈ నేపథ్యంలోనే నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రజనీకాంత్ సమావేశమయ్యారు. భేటీకి ముందు ర‌జ‌నీకాంత్.. యోగి పాదాల‌ను తాకడానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి.

కొద్దిసేపటి క్రితం రజనీకాంత్ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. గౌరవప్రదంగా ఈ భేటీ జరిగిందని నటుడు రజనీకాంత్ అన్నారు. అఖిలేష్ యాదవ్‌తో భేటీ అనంతరం రజినీ అయోధ్యలోని రామమందిరానికి వెళ్లనున్నారు. అయితే.. మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి మాయావ‌తిని కూడా క‌ల‌వ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.


Tags:    

Similar News