మిన్నంటిన 'మోదీ.. మోదీ..' నినాదాలు

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్‌ పై భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంలో

Update: 2023-12-03 07:04 GMT

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్‌ పై భారతీయ జనతా పార్టీ భారీ ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ లో పాలక ప్రభుత్వాన్ని దింపేయడం అక్కడి ఓటర్లకు బాగా అలవాటు.. అందుకు తగ్గట్టుగా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు పట్టం కట్టినట్లే తెలుస్తోంది. ఉదయం 10:57 గంటలకు బీజేపీ 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినప్పుడు ప్రారంభ ట్రెండ్‌లు కనిపించాయి.

కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ.. రాజ‍స్థాన్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2/3 మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాజస్థాన్ బీజేపీ ఆఫీసులో పండగ వాతావరణం నెలకొంది. 'మోదీ, మోదీ' నినాదాలు మిన్నంటాయి. రాజస్థాన్‌లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అధికారం ఊగిసలాడుతూ ఉంది. 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు బీజేపీ సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది.


Tags:    

Similar News