Parliament : ఢిల్లీ పార్లమెంటులో దాడిలో పాల్గొంది వీళ్లే

పార్లమెంటులో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులు ఈ దాడిలో పాల్గొన్నారు

Update: 2023-12-13 11:01 GMT

parliament

పార్లమెంటులో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులు ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి ఘటనతో విజిటర్స్ పాస్‌లను స్పీకర్ రద్దు చేశారు. తిరిగ యధాతధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిందితులకు తగిన శిక్ష విధించేలా చేస్తామని సభకు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా సభకు హామీ ఇచ్చారు. అయితే నిందితులు ఎందుకోసం ఈ దాడి చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల అదుపులో నలుగురు నిందితులున్నారు.


నిందితులు వీళ్లే

సాగర్ శర్మ - మైసూరు (కర్ణాటక)
మనోరంజన్ మైసూర్ (కర్ణాటక)
నీలంకౌర్ హిస్సార్ (హర్యానా)
అమోల్ షిండే లాతూర్ (మహారాష్ట్ర)


Tags:    

Similar News