Bengaluru : బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాద కుట్ర భగ్నం

కర్ణాటకలోని బెంగళూరులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది.

Update: 2023-12-13 05:48 GMT

national investigation agency

కర్ణాటకలోని బెంగళూరులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా బెంగళూరులో ఎన్ఐఏ అధికారులు ఉదయం నుంచి తనిఖీలను నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా బెంగళూరులోనూ ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగానే ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కీలక పత్రాలను...
మహారాష్ట్ర, కర్ణాటకల్లోని నలభై నాలుగు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలను నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ పదిహేను మందిని అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో నగదుతో పాటు తుపాకీలు కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. కొన్ని కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకే ఈ సోదాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News