నేడు మోదీ మణిపూర్, త్రిపురలో పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్, త్రిపురలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

Update: 2022-01-04 02:48 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్, త్రిపురలో పర్యటించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా త్రిపురలో అగర్తాలాలోని మహారాజా వీర్ విక్రమ్ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ టెర్మినల్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రద్దీగా ఉండే విమానాశ్రయం ఇది.

ఆధునిక సౌకర్యాలు...
కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం టెర్మినల్ లో అనేక అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. మూడు మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. దీంతో పాటు అనేక కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. మోదీ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News