నేడు మరోసారి యూపీకి మోదీ

Update: 2021-12-28 02:50 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో తిరిగి బీజేపీ జెండా ఎగరాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న యూపీలో బీజేపీకి మరోసారి విజయం దక్కేందుకు మోదీ నేరుగా రంగంలోకి దిగినట్లే కన్పిస్తుంది.

కాన్పూర్ మెట్రో రైలును..
అందుకే మోదీ గత నెల రోజుల నుంచి ఉత్తర్ ప్రదేశ్ ను వదిలిపెట్టకుండా తిరుగుతున్నారు. ఈరోజు కూడా ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కాన్పూరులోని మెట్రో రైల్వే ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. అలాగే అనంతరం కాన్పూరు స్నాతకోత్సవంలో మోదీ పాల్గొననున్నారు.


Tags:    

Similar News