ఇస్రోలో విషాదం.. ఆమె మృతి

శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించే

Update: 2023-09-04 02:02 GMT

శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వాలర్మతి కన్నుమూశారు. ఆమె గుండెపోటుతో మరణించారని అధికారులు తెలిపారు. ఆమె చివరిసారిగా చంద్రయాన్-3 సమయంలో కౌంట్‌డౌన్ చెప్పారు.జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఆగష్టు 23న, చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి మీద ల్యాండ్ అయింది.

భారత అంతరిక్ష సంస్థ ప్రయోగాల కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్‌మతి మృతి చెందారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలి చంద్రయాన్-3 మిషన్‌లో చివరిసారిగా కౌంట్ డౌన్ విధులు నిర్వర్తించారు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ వేళ తన స్వరం వినిపించిన వాలర్మతి గొంతు మూగబోయిందని ఇస్రో తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మరణించారని.. ఆమె చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలను నిర్వర్తించారని.. ఆమె సేవలు మరువలేమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News