భారత సైన్యాన్ని మరోసారి దొంగ దెబ్బ తీసిన తీవ్రవాదులు

భారత సైన్యాన్ని మరోసారి దొంగ దెబ్బ తీసిన తీవ్రవాదులు

Update: 2022-07-17 11:51 GMT

కశ్మీర్‌లో ఉగ్రవాదులు భారత సైన్యంపై మరోసారి దొంగ దెబ్బ తీశారు. పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్‌ బృందంపై దాడి చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని ఆపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, ఆ సమయంలో CRPF సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన అధికారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌ పుల్వామాలోని నాకా పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. కాల్పుల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.


Tags:    

Similar News