ఢిల్లీలో మంకీ పాక్స్ కలకలం

ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఒక వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు.

Update: 2022-07-24 06:06 GMT

ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఒక వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. దీంతో భారత్ లో మొత్తం నాలుగు మంకీ పాక్స్ కేసులు నమోదయినట్లయింది. కేరళలో ఇప్పటి వరకూ మూడు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ...
ఇప్పుడు తాజాగా ఢిల్లీలో మంకీ పాక్స్ కేసు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి, వారికి ఆ లక్షణాలు కనపడితే వెంటనే ఐసొలేషన్ కు తరలించాలని సూచించింది. కరోనా తరహాలో మంకీ పాక్స్ ప్రపంచానికి ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


Tags:    

Similar News