నైసార్ ప్రయోగం విజయవంతం
జీఎస్ఎల్వీ ఎఫ్ 16తో నైసార్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది
జీఎస్ఎల్వీ ఎఫ్ 16తో నైసార్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. నిసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోశాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 11,200 కోట్ల రూపాయలతో నాసా, ఇస్రో నైసార్ ఉపగ్రహాన్ని ఉమ్మడి ప్రయోగం చేసింది. ఈరోజు సాయంత్రం 5.40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి నైసార్ ఉపగ్రహం దూసుకెళ్లింది. భూమి అణువణువును 12 రోజులకోసారి నిసార్ స్కాన్ చేసేస్తుంది. అడవులు, మైదాన ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వన రులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడ పట్టనుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తుంది. కొండచరియలు విరిగిపడటాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవ డాన్ని ముందే గుర్తించేందుకు వీలుంటుంది.