గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు నమోదు

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ముంబయిలో కేసు నమోదయింది. కాపీరైట్ ఉల్లంఘన కింద ఈ కేసు నమోదయింది.

Update: 2022-01-26 13:52 GMT

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ముంబయిలో కేసు నమోదయింది. కాపీరైట్ ఉల్లంఘన కింద ఈ కేసు నమోదయింది. సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు యూట్యూబ్ గౌతమ్ ఆనంద్ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేవఆరు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.

కాపీ రైట్ ఉల్లంఘన కింద....
2017లో విడుదలయని ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా చిత్రానికి సంబంధించి ఈ కేసు నమోదయింది. ఈ సినిమాకు బిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చినా వారు స్పందించలేదు. ఆయనకు రావాల్సిన ప్రయోజనం దక్కలేదు. దీంతో ఆయన పోలీసులకు కాపీరైట్ ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News