బీజేపీలో కాంగ్రెస్ విలీనానికి ఓకే

గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం అయ్యేందుకు అంగీకరించారు.

Update: 2022-09-15 07:11 GMT

గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. తాను సీఎల్పీని బీజేపీలో విలీనానికి అంగీకరించినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. దీంతో గోవాలో కాంగ్రెస్ శాసనసభ పక్షం బీజేపీలో విలీనమయిందనే చెప్పాలి.

మెజారిటీ సభ్యులు...
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు లేఖ ఇచ్చారని, విలీనానికి అవసరైమైన సంఖ్యలో సభ్యులం ఉన్నామని తెలపడంతో తాను అంగీకరించానని స్పీకర్ రమేష్ తవాడ్కర్ తెలిపారు. మెజారిటీ సభ్యులు ఉండటంతో విలీనం అయ్యేందుకు అంగీకరించానని ఆయన చెప్పారు. గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News