మాజీ ముఖ్యమంత్రి బాదల్ మృతి

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్​ మృతి చెందారు.

Update: 2023-04-26 03:43 GMT

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్​ మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు. వారం రోజుల క్రితం ప్రకాశ్​ బాదల్​ అనారోగ్యంతో మొహాలిలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఆసుపత్రిలో చేరారు. బాదల్​ మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత ఉన్నతమైన రాజకీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచారని ఆమె ట్వీట్ చేశారు.

పలువురి సంతాపం...
ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ సంతాపం వ్యక్తం చేశారు. బాదల్​ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్​ చేశారు. భారత రాజకీయాల్లో బాదల్ కీలక పాత్ర పోషించారని.. దేశానికి ఎంతో సేవ చేశారని ప్రధాని తన ట్వీట్​లో పేర్కొన్నారు. బాదల్​ మరణం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టం చేకుర్చుందన్నారు. దశాబ్దాల పాటు బాదల్​తో సాన్నిహిత్యం ఉందన్న మోదీ.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.


Tags:    

Similar News