భర్తలకు భారీ షాకిచ్చిన ఐదుగురు వివాహితలు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం భూమి ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ..

Update: 2023-02-08 04:37 GMT

ఐదుగురు వివాహితలు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి నగదు రూపంలో అందే సాయం వచ్చీరాగానే ఐదుగురు వివాహితలు తమ ప్రియుళ్లతో జంప్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాల్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆ భార్యలు చేసిన పని స్థానికంగా సంచలనం రేపింది. అకౌంట్లలో పడిన డబ్బులతో ప్రియుళ్లతో భార్యలు వెళ్లిపోయారని తెలిసి.. భర్తలు లబోదిబోమంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం భూమి ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పదకం కింద బారాబంకీ జిల్లా నుండి 40 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. తొలివిడతగా వారి అకౌంట్లలో రూ.50 వేలు జమ చేశారు. అలా డబ్బు అకౌంట్లలో పడగానే వివాహితలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భర్తలు.. వారికి రెండో విడత సాయంగా నగదు వేయొద్దంటూ అధికారులను వేడుకున్నారు.


Tags:    

Similar News