దేశవ్యాప్తంగా 44 చోట్ల ఈడీ దాడులు

దేశవ్యాప్తంగా చైనా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది.

Update: 2022-07-05 07:21 GMT

దేశవ్యాప్తంగా చైనా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది. దేశంలో ఏకకాలంలో నలభై నాలుగుచోట్ల ఈ దాడులు నిర్వహిస్తుంది. వివో మొబైల్ తో పాటు పలు చైనీస్ సంస్థలపై ఈ దాడులను నిర్వహిస్తుంది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారు.

మనీ లాండరింగ్...
బీహార్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేవ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈ కంపెనీలపై కేసులు నమోదు చేయనున్నారు.


Tags:    

Similar News