నేడు పంజాబ్ లో రాహుల్, కేజ్రీవాల్ ప్రచారం

పంజాబ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ లో పర్యటించనున్నారు

Update: 2022-01-27 03:07 GMT

పంజాబ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ ప్రచారం తో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాహుల్ పర్యటన ముఖ్యమైన నియోజకవర్గాల్లో జరిగేలా పార్టీ ప్రణాళికలను రూపొందించింది.

కేజ్రీవాల్ నేడు...
ఈరోజు ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ లో పర్యటించనున్నారు. ఆయన జలంధర్, అమృత్ సర్ లో జరిగే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటించనున్నారు. పంజాబ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఇద్దరి అగ్రనేతల పర్యటన నేడు పంజాబ్ లో జరగనుంది.


Tags:    

Similar News