10 నుంచి కేదార్‌నాథ్ లో దర్శనానికి అనుమతి

కేదార్‌నాధ్ ఆలయంలో ఈనెల పదోతేదీ నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

Update: 2024-05-08 02:45 GMT

కేదార్‌నాధ్ ఆలయంలో ఈనెల పదోతేదీ నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ లోని ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల పదోతేదీన ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాల్సి వస్తుండటంతో గత ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ప్రభుత్వం ఏర్పాట్లు...
భక్తులకు కేదార్‌నాధ్ ఆలయంలోకి ఈ నెల 10వ తేదీ నుంచి అనుమతిస్తారు. దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈసారి పెద్దసంఖ్యలో కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులు చేరుకుంటారన్న దానితో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది.


Tags:    

Similar News