గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 180 మంది మరణించారు

Update: 2022-03-01 05:02 GMT

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,915 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 180 మంది మరణించారు. చాలా రోజుల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 5,14,023 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పాజిటివిటీ రేటు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 92,472 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,31,045 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,14,023 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 92,472 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,77,70,25,914 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.


Tags:    

Similar News