రెండోకాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేలు

ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో పథకానికి రూపకల్పన చేసింది.

Update: 2023-06-09 06:38 GMT

mission shakti scheme

ఆడపిల్లలను భారంగా భావించి పురిటిలోనే గొంతునొక్కేస్తున్న తల్లిదండ్రులెందరో. పుట్టగానే కనీసం కళ్లుతెరిచి లోకాన్నైనా చూడకుండానే.. ఆడపిల్ల పుట్టిందని వదిలించుకుంటున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో పథకానికి రూపకల్పన చేసింది. మిషన్ శక్తిపేరుతో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే.. తల్లుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేయనుంది. ఆడపిల్లల సంఖ్య పంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

రెండో కాన్పులో కవలలు పుట్టినా.. అందులో ఆడపిల్ల ఉంటే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. కాగా.. తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల కోసం ఇప్పటికే కేంద్రం "ప్రధానమంత్రి మాతృ వందన యోజన" పథకాన్ని అమలు చేస్తోంది. తొలి కాన్పులో ఏ బిడ్డ పుట్టినా.. మూడు దశల్లో తల్లులకు రూ.5 వేలు అందజేస్తోంది. గర్భం దాల్చినట్లు నమోదు చేసుకున్నాక రూ.1000, 6 నెలల తర్వాత రూ.2 వేలు, ప్రసవించాక ఇమ్యునైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2 వేలు చొప్పున నగదు అందజేస్తోంది. అయితే ఈ పథకం రెండో కాన్పునకు వర్తించదు.





Tags:    

Similar News