నేడు కోర్టుకు సిసోడియా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది.

Update: 2023-03-06 04:19 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం సిసోడియాను స్పెషల్ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు. ఈ స్కామ్ లో వారం రోజుల పాటు మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు.

సీబీఐ కస్టడీ...
అనేక రకాలుగా ఈ కేసులో సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు సమాచారాన్ని సేకరించింది. అయితే కోర్టు ఇచ్చిన కస్టడీతో ముగియడంతో నేడు కోర్టులో తిరిగి ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ శుక్రవారం స్పెషల్ కోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది.


Tags:    

Similar News