ఏకగ్రీవం ఎందుకు.? నోటాకు అభ్యర్థి హోదా లేదా.?
ఎన్నికల సమయంలో ఒక సీటుపై ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటే అప్పుడు ఎన్నికల సంఘం అతన్ని ఏకపక్షంగా విజేతగా ప్రకటిస్తుంది. ఆ స్థానంలో ఎన్నికలు జరగవు. ఎన్నికల సంఘం ఆచరిస్తున్న ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.
ఎన్నికల సమయంలో ఒక సీటుపై ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉంటే అప్పుడు ఎన్నికల సంఘం అతన్ని ఏకపక్షంగా విజేతగా ప్రకటిస్తుంది. ఆ స్థానంలో ఎన్నికలు జరగవు. ఎన్నికల సంఘం ఆచరిస్తున్న ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.
సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారిస్తూ.. ఎన్నికల్లో ఒక అభ్యర్ధి మాత్రమే బరిలో ఉండి.. రెండో పక్షం లేనప్పుడు.. ఓటర్లకు నోటా (పైన ఏదీ కాదు)ను ఎంచుకునే అవకాశం ఇందుకు ఇవ్వరు? దీనిపై ప్రభుత్వం నోటాకు అభ్యర్థి హోదా ఇవ్వలేమని చెబుతోందా అని ప్రశ్నించింది.
ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1961లోని సెక్షన్ 53(2)ని పిటిషన్లో సవాలు చేశారు. దీని ప్రకారం.. ఒక అభ్యర్థి మాత్రమే ఒక సీటుపై నిలబడితే, ఓటు వేయకుండానే అనూహ్యంగా విజేతగా ప్రకటించబడతారు.
పిటిషన్పై విచారణ సందర్భంగా.. నోటాపై ఓటు వేసే ముందు.. ఏ అభ్యర్థిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయోచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. అభ్యర్థిపై తీవ్ర ఆగ్రహం ఉంటే ప్రజలు స్వతంత్ర అభ్యర్థిని కూడా బరిలోకి దించవచ్చని చెబుతోంది.
కాగా, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన సమాధానాన్ని దాఖలు చేస్తూ.. నోటాకు, ఏ అభ్యర్థికి సమాన హోదా ఇవ్వబడదు లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 కింద పరిగణించబడదు. నోటా అనేది కేవలం ఒక ఎంపిక. ఇది అభ్యర్థి నిర్వచనానికి సరిపోదు అని పేర్కొంది.
చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఓటు హక్కు అనేది చట్టబద్ధమైన హక్కు. ప్రాథమిక హక్కు కాదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు ఒక చట్టాన్ని ఆమోదించాయని.. దాని ప్రకారం స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఈ నిబంధన వర్తించదు.