మణిపూర్ లో మళ్లీ విజయం.. అదెలాగ?

మణిపూర్ లోనూ బీజేపీ అఖండ విజయం సాధించింది. గతం కంటే స్థానాలను మెరుగుపర్చుకుని పూర్తి స్థాయి మెజారిటీని సాధించుకుంది

Update: 2022-03-10 13:19 GMT

మణిపూర్ లోనూ బీజేపీ అఖండ విజయం సాధించింది. గతం కంటే స్థానాలను మెరుగుపర్చుకుని పూర్తి స్థాయి మెజారిటీని సాధించుకుంది. 2017 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవరతించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో కాంగ్రెస్ 28 స్థానాలను, బీజేపీ 21 స్థానాలను గెలుచుకున్నాయి. మిగిలిన పార్టీల మద్దతుతో బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.

కాంగ్రెస్ మరింత బలహీనం...
అధికారంలో ఉన్న పార్టీపై ఉన్న అసంతృప్తిని తాము ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ కనీసం ప్రయత్నించలేదు. ఫలితంగా గత ఎన్నికల్లో 21 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 32 స్థానాలను సాధించింది. గత ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ నాలుగు స్థానాలకు పరిమితమయింది. ఎన్.పి.పి. కి ఎనిమిది స్థానాలు, ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ కంటే స్వతంత్ర అభ్యర్థులే బలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు నిరూపించాయి.


Tags:    

Similar News