బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ .. నలుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో సౌత్ వేస్ట్ రీజియన్ లో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి, ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్న ట్టు పోలీసులు తెలిపారు.
పెద్దయెత్తున ఆయుధాలు...
మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ తెలిపారు. భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్ స్థలం లో నలుగురు మావోయిస్టు ల మృత దేహాలు లభ్యమ య్యాయని, పోలీసులు తెలిపారు