అహ్మదాబాద్ విమాన ప్రాధమిక నివేదికలో ఏముందంటే?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక అందించింది

Update: 2025-07-12 02:34 GMT

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక అందించింది. ప్రాథమిక నివేదికలో ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. విమానం స్టార్ట్‌ అయ్యాక గరిష్ఠ వేగాన్ని అందుకుందని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ఇంజిన్‌ 1, ఇంజిన్‌ 2 ఆగిపోయాయని తెలిపారు. ఫ్యుయెల్ స్విచ్‌లు రన్‌ నుంచి కటాఫ్‌కు మారాయని తెలిపింి. సెకన్ల వ్యవధిలో ఇంజిన్లకు నిలిచిపోయిన ఫ్యుయెల్ ఇంజిన్‌ను ఎందుకు ఆఫ్‌ చేశారని..పైలట్‌ను అడిగినట్టు కాక్‌పిట్‌లో రికార్డయిందని తేలింది. రెండో పైలట్‌ తాను ఇంజిన్‌ను ఆఫ్‌ చేయలేదని చెప్పడం కూడా వినిపించింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమాన RAT బయటకొచ్చిందని, రెండు ఇంజిన్ల స్విచ్‌లను రన్‌లో తిరిగి ఉంచారని, ఇంజిన్‌ 1లో రీలైటింగ్‌ ప్రక్రియ విజయవంతమైందని నివేదికలో తెలిపారు.

మే డే కాల్ ఇవ్వగానే...
ఇంజిన్‌ 2 ప్రారంభమైంది కానీ పవర్‌ అందుకోలేదని, మ.1:39కి పైలట్‌ మేడే కాల్‌ ఇచ్చారు ఏఏఐబీ నివేదిక తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రెస్పాన్స్‌ అయ్యిందని, కానీ పైలట్‌ నుంచి తిరిగి రెస్పాన్స్‌ రాలేదని నివేదికలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు గోడను దాటే ముందు విమానం కూలిపోయిందని, సీసీ ఫుటేజ్‌లో పక్షి ఢీకొన్న సంఘటన ఏదీ కనిపించలేదని, మ.1:44 గంటలకు ఫైరింజన్లు వెళ్లాయని ఏఏఐబీ నివేదిక లో తెలిపింది. ప్రమాద స్థలాన్ని డ్రోన్‌తో రికార్డింగ్‌ జరిగిందని, శిథిలాలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారని, ఇంజిన్లు, ఇతర భాగాలను పరీక్షించేందుకు భద్రపరిచారని, విమానంలో ఫ్యుయెల్‌ సరైనదేనని తేలిందని ఏఏఐబీ నివేదిక తేల్చి చెప్పింది.


Tags:    

Similar News