స్కూల్ లో ఫుడ్ పాయిజన్.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. ఈ ఘ‌ట‌నపై విద్యాశాఖ అధికారి మోహ‌న్ గైక్వాడ్ మాట్లాడుతూ..

Update: 2023-01-28 07:20 GMT

maharastra students food poison

తినే ఆహారం కలుషితమవ్వడంతో.. 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. వాన్ లెస్ వాడి హైస్కూల్లో 5,7వ తరగతుల విద్యార్థులు.. శుక్రవారం మధ్యాహ్నం స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్‌ కిచెన్‌లో అన్నం, ప‌ప్పు కూర‌తో తిన్న త‌రువాత అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. మొత్తం 36 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురి కాగా వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వీరిలో 35 మంది విద్యార్థులను చికిత్స అందించిన అనంత‌రం డిశ్చార్జ్ చేశారు. మ‌రొక విద్యార్థిని మాత్రం అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి.. అత‌డికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. ఈ ఘ‌ట‌నపై విద్యాశాఖ అధికారి మోహ‌న్ గైక్వాడ్ మాట్లాడుతూ.. వాన్‌లెస్‌వాడి హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో బాధపడ్డారని తెలిపారు. వారిలో చాలా మందికి వాంతులవ్వడంతో.. వెంటనే చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. అంద‌రికీ చికిత్స చేసి.. డిశ్చార్జ్ చేయ‌గా.. ఓ విద్యార్థి కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడని, అతడికి సెలైన్ ఎక్కించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పాఠశాల, సెంట్రల్ కిచెన్ నుంచి సేక‌రించిన‌ ఆహార నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపినట్లు గైక్వాడ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ కోసం ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు మోహన్ గైక్వాడ్ తెలిపారు.


Tags:    

Similar News