Prabhas : అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ 'స్పిరిట్' అప్డేట్.. బన్నీ ఫ్యాన్స్ బాధ..

అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ 'స్పిరిట్' అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా. ఆ అప్డేట్ తో బాధ పడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.

Update: 2023-11-24 13:49 GMT

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' వచ్చే నెలలో రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోయిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంతో పాటు కల్కి 2898 AD, మారుతీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాలు తరువాత 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా సందీప్ వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి.. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీ గురించిన క్రేజీ అప్డేట్ ని సందీప్ వంగా ఆడియన్స్ కి ఇచ్చారు.
యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సందీప్ వంగా.. రీసెంట్ గా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్ అండ్ రష్మిక మందన్నతో కలిసి వచ్చారు. ఇక ఈ షోలోనే బాలకృష్ణ 'స్పిరిట్' గురించి సందీప్ ని ప్రశ్నించారు. దర్శకుడు బదులిస్తూ.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలియజేశారు. ఇక ఇదే షోలో ఉన్న రణబీర్.. ఆ సినిమాలో తనకి ఒక చిన్న ఛాన్స్ ఉన్నా ఇవ్వమని, ప్రభాస్ అన్నతో కలిసి నటించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక సందీప్ ఇచ్చిన సమాధానంతో.. స్పిరిట్ మూవీ 2025లో ఆడియన్స్ ముందుకు రానుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ వార్తతో నిరాశ చెందుతున్నారు. సందీప్ వంగా అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 2025 వరకు స్పిరిట్ తోనే ఉంటే, అల్లు అర్జున్ మూవీ చూడాలంటే.. 2026 వరకు ఆగాల్సిందేనా అంటూ బాధపడుతున్నారు.


Tags:    

Similar News