స్టార్ హోటల్ ను ప్రారంభించిన హరీశ్ రావు

రంగనాయక్ సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2021-12-24 12:41 GMT

రంగనాయక్ సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మెదక్ జిల్లాలోని రాజీవ్ రహదారిపై నిర్మించిన టూరిజం స్టార్ హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకంగా తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధఇ చెందిందని హరీశ్ రావు తెలిపారు. అన్ని రకాలుగా తెలంగాణ గత ఏడేళ్ల కాలంలో అభివృద్ధి చెందిందని తెలిపారు.

టూరిజం హోటల్ ను....
సిద్ధిపేట పట్టణ శివారులో ఈ టూరిజం స్టార్ హోటల్ ను నిర్మించారు. పదిహేను కోట్ల వ్యయంతో నిర్మించిన స్టార్ హోటల్ లో అన్ని వసతులున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు 28 ఏసీ గదులు, బాంకెట్ హాల్, ఫంక్షన్ లాన్, భోజన సదుపాయాలు ఉన్న ఈ రెస్టారెంట్ ను హరీశ్ రావు ప్రారంభించారు.


Tags:    

Similar News