భారత్ - కెనడా మధ్య సంబంధాలు మరింత బలీయంగా
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ముంబయికి చేరుకున్నారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ముంబయికి చేరుకున్నారు. భారతదేశానికి ఆయన ఇది తొలి అధికారిక పర్యటన. గత కొన్నేళ్లలో తన ముందస్తు ప్రధాని కాలంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను సరిచేయడం, న్యూఢిల్లీతో వాణిజ్య సహకారాన్ని మరింతగా పెంచడం ఈ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కార్నీ వ్యాపార రంగ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.భారత్ లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటించనున్నారు. వాణిజ్య, పెట్టుబడి సహకారంపై చర్చలు జరపనున్నారు. గత ఉద్రిక్తతల తర్వాత సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటన సాగనుంది.
అమెరికాపై ఆధారాన్ని తగ్గించే దిశగా....
ఇద్దరు నాయకుల భేటీ “ముందుకు సాగే భాగస్వామ్యానికి అనుకూలమైన దిశ, ఉమ్మడి దృక్పథాన్ని మరోసారి స్పష్టంచేసే అవకాశం”గా మారుతుందని భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కీలక ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో సహకారం అంశాలు చర్చకు రానున్నాయని పేర్కొంది. తదుపరి వారం కార్నీ ఆస్ట్రేలియా, జపాన్లను కూడా సందర్శించనున్నారు. అమెరికాపై వాణిజ్య ఆధారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఇది భాగమని అధికారులు తెలిపారు. వచ్చే దశాబ్దంలో అమెరికాేతర ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని కార్నీ పెట్టుకున్నారు. అమెరికా విధిస్తున్న సుంకాలు పెట్టుబడుల వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దిగజారిన బంధాలు...
గత ఏడాది రెండు సంవత్సరాల ఉద్రిక్తతల తర్వాత కెనడా, భారత్ వాణిజ్య ఒప్పందం దిశగా ముందడుగు వేశాయి. 2023 జూన్లో వాంకూవర్ సమీపంలో కెనడాకు చెందిన సిక్కు కార్యకర్త హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా అధికారులు ఆరోపించారు. న్యూఢిల్లీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖలిస్తాన్ ఉద్యమానికి చెందిన తీవ్రవాదులను ఆశ్రయిస్తోందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై భారత్ విమర్శలు చేసింది. స్వతంత్ర సిక్కు దేశం ఏర్పాటే లక్ష్యంగా ఉన్న ఖలిస్తాన్ ఉద్యమాన్ని భారత్ నిషేధించింది. గత ఏడాది జూన్లో అల్బర్టాలో జరిగిన జీ7 సదస్సుకు మోదీని కార్నీ ఆహ్వానించిన తర్వాత సంబంధాలు కొంత మెరుగయ్యాయి. విదేశీ భూభాగంలో హత్య కుట్ర ఆరోపణలు ఎదుర్కొన్న దేశం భారత్ ఒక్కటే కాదు. 2023లో న్యూయార్క్లో మరో సిక్కు వేర్పాటువాదిని హత్య చేయాలన్న విఫలయత్నానికి భారత ప్రభుత్వ అధికారి పర్యవేక్షణ చేశాడని అమెరికా ఫెడరల్ అభియోగాధికారులు ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో భారత్కు చెందిన ఓ వ్యక్తి ఆ వేర్పాటువాది నేతను హత్య చేయించేందుకు హిట్మ్యాన్ను నియమించేందుకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడు.