విద్యార్థినిపై అత్యాచారం... యువకుడి దారుణం

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఒక యువకుడు

Update: 2021-12-30 03:50 GMT

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఒక యువకుడు. రాజేంద్ర నగర్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని తన మాటలతో లోబర్చుకుని హిమాయత్ సాగర్ కు తీసుకెళ్లాడు యువకుడు. తన బైక్ పై విద్యార్థిని తీసుకెళ్లిన ఆ యువకుడు అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

తల్లి అడగటంతో....
అత్యాచారం చేసిన తర్వాత విద్యార్థినిని ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి గట్టిగా అడగడంతో ఆ విద్యార్థిని అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News