ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు నిషేధించడంతో

Update: 2023-09-25 17:30 GMT

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు నిషేధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయొద్దంటూ పీవోపీ గణేష్ విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గణేష్ విగ్రహ మండపాల నిర్వాహకులు అందోళన నిర్వహించారు. ట్యాంక్ బండ్ రోడ్డుపై భైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా గణేష్ మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. హిందూ పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని అన్నారు. గత సంవత్సరం నుండి ప్రభుత్వం పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందని.. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

హైదరాబాద్ జంటనగరాల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్ బండ్ పై పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని.. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూడాలని, పీవోపీ విగ్రహాల నిమజ్జనం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి కోర్టుకు నివేదిక సమర్పించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌, చెరువుల్లో పీఓపీ తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మినీ కొలనులు సిద్ధం చేసింది. భారీ విగ్రహాలు మినహా ఎక్కడికక్కడే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసేలా మినీ కొలనులలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News