Breaking : ఉగాది రోజున హైదరాబాద్ వాసులకు మెట్రో బపంపర్ ఆఫర్

మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-04-08 13:17 GMT

మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉగాది రోజు నుంచి ఈ ఆఫర్ ను అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. హాలిడే కార్డ్్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన చేసింది.

రేపటినుంచి...
రేపటి నుంచి ఈ ఆఫర్లు మరో ఆరు నెలలపాటు అందుబాటులో ప్రయాణికులకు ఉండనున్నాయి. ఇటీవల రాయితీలతో కూడిన ప్రయాణాలను రద్దు చేయడంతో హైదరాబాద్ వాసుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం కావడంతో మెట్రో యాజమాన్యం దీనిపై పునరాలోచించి ఆరు నెలలు రాయితీలను పొడిగించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News