Hyderabad : మెట్రో రైలు ప్రయాణికులకు షాక్.. ఎల్లుండి నుంచి ధరల పెంపు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-05-15 12:02 GMT

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైలు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. కనీసం పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకూ ఛార్జీలు పెంచనున్నట్లు తెలిసింది. మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్ లో ఉంది.

పది నుంచి పన్నెండు రూపాయలు...
హైదరాబాద్ మెట్రో రైళ్లకు ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ నష్టాలు వస్తున్నాయని మెట్రో రైలు సంస్థ చెబుతుంది. చాలా రోజుల నుంచి ఛార్జీలను పెంచేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎల్లుండి నుంచి ఛార్జీలను పెంచుతూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News