Hyderabad : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం?
రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నగరంలోని రెండు ప్రధాన ఫ్లైఓవర్లను పరిశీలించారు.
రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నగరంలోని రెండు ప్రధాన ఫ్లైఓవర్లను పరిశీలించారు. జూబ్లీహిల్స్ – మాదాపూర్ను కలిపే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్ తో పాటు కొండాపూర్ – గచ్చిబౌలిని కలిపే పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లను ఆయపదగ్గరుండి పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు.
రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్...
ఈ పర్యటనలో ఆయనతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, సీసీటీవీ కెమెరాలు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్, చెవ్రాన్ బోర్డులు, కాంక్రీట్ బారియర్లు మరియు రాత్రి సమయంలో మెరుగైన వెలుగు వచ్చేందుకు అవసరమైన ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైటింగ్ను పరిశీలించారు.