Hyderabad : సినీ సెలబ్రెటిలపై ఈడీ కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సినీ సెలబ్రిటీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సినీ సెలబ్రిటీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చసింది. వీరిని విచారించేందుకు సిద్ధమవుతుంది. సినీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచులక్ష్మి, ప్రకాశ్ రాజా, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితర నటులపై సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న...
సిని సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్యూయెర్స్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ అధికారులువారిని విచారించాలని నిర్ణయించారు. ఇక యాంకర్ శ్యామల, శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయనిపావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బంగారు సుప్రిత పేర్లు కూడా ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. త్వరలోనే వీరిని ఈడీ విచారించే అవకాశముంది.