శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానం ల్యాండింగ్ సమస్య తలెత్తింది

Update: 2025-02-18 05:31 GMT

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ సమస్యలో గేర్ సమస్య తలెత్తింది.రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిని పైలెట్ కోరారు. అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సేఫ్ గా కార్గో ఫ్లైట్ ల్యాండింగ్‌ చేయించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు.

కార్గో విమానం...
దీంతో కార్గో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో విమానం లో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి వేగంగా చర్యలు తీసుకోవడం వల్లనే విమానం సేఫ్ గా ల్యాండ్ అయిందని చెబుతున్నారు.


Tags:    

Similar News