ఫ్యాక్ట్ చెక్: షాంఘై శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో కరచాలనం చేయలేదన్న వాదనలో నిజం లేదు

టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రపంచ నాయకులకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. రెండు

Update: 2025-09-01 10:37 GMT

SCO Summit

టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రపంచ నాయకులకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. రెండు రోజుల ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 20 కి పైగా దేశాల నాయకులు సమావేశమయ్యారు. SCOలో చైనా, భారతదేశం, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ దేశాలు భాగంగా ఉన్నాయి. పరిశీలకులు, ఇతర భాగస్వాములుగా అనుబంధంగా మరో 16 దేశాలు ఉన్నాయి. 

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అనేక మంది ప్రపంచ నాయకులతో కలిసి ఉత్తర చైనాలోని టియాంజిన్‌లో ఉన్నారు. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో తన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి న్యూఢిల్లీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రధాని మోదీతో కరచాలనం చేయడానికి ఆసక్తి చూపడం లేదని, ఆయనను అవమానిస్తున్నారని పేర్కొంటూ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “जिनपिंग भाव नहीं दे रहा है बस फॉर्मेलिटी निभा रहा हैं.! और साहब से कंट्रोल नहीं हो रहा हैं,, शर्म भी नहीं आता 20 जवानों के शहादत को भूलकर दांत निपोर रहे हैं..!” అంటూ హిందీలో పోస్టులు పెట్టారు. "జీ జిన్‌పింగ్ ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించడం లేదు, కేవలం లాంఛనప్రాయంగా ముందుకు సాగుతున్నారు. ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు, అతనికి సిగ్గుగా కూడా అనిపించడం లేదు, 20 మంది సైనికుల బలిదానాన్ని మర్చిపోయి, అతను ఇంకా తన దంతాలను బయటపెడుతున్నాడు..!" అని అందులో ఉంది.



వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఆ వీడియో పాతది, అసంపూర్ణమైనది. SCO సమ్మిట్‌కు సంబంధించి ఇటీవల అప్లోడ్ చేసిన వీడియోల కోసం మేము వెతికినప్పుడు, చైనా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతించి, గౌరవంగా కరచాలనం చేస్తున్నట్లు చూపించే వార్తా నివేదికలు, షేర్ చేసిన వీడియోలను కనుగొన్నాము.
Full View

Full View
వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో పాతది, అసంపూర్ణంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 23, 2024న ANI న్యూస్ 'Historic handshake': PM Modi holds meeting with Chinese President Xi Jinping at BRICS Summit”. అనే శీర్షికతో ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లుగా మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, ఇద్దరు నాయకులు వేదిక వద్దకు వెళ్లిన తర్వాత కరచాలనం చేయడాన్ని మనం చూడవచ్చు. జి జిన్‌పింగ్ కరచాలనం చేయడానికి ముందుకు వచ్చారు.
Full View
NDTV షేర్ చేసిన మరో వీడియో వైరల్ వీడియోకు సంబంధించి పొడవైన వెర్షన్‌ను కూడా చూపిస్తుంది, ఇందులో రెండు దేశాల నేతలు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుంటున్నట్లు చూడవచ్చు.
Full View
అందువల్ల, SCO శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కరచాలనం చేయడానికి జి.జిన్‌పింగ్ నిరాకరించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో పాతది, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో నాయకులు కలిసినప్పటిది. వైరల్ అవుతున్న వీడియో అసంపూర్ణంగా ఉంది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim :  SCO శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత ప్రధానితో కరచాలనం చేయకపోవడాన్ని వైరల్ వీడియోలో చూడొచ్చు
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News