ఫ్యాక్ట్ చెక్: 2024 సార్వత్రిక ఎన్నికల కారణంగా కొత్తగా కమ్యూనికేషన్ నిబంధనలను కేంద్రం అమలు చేయడం లేదు

భారత ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) దేశవ్యాప్తంగా అమలు చేయబడింది. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, డ్రగ్స్, తాయిలాలు, ఇతర వస్తువుల తరలింపుపై నిఘా పెట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.

Update: 2024-04-19 05:15 GMT

Rules

భారత ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) దేశవ్యాప్తంగా అమలు చేయబడింది. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, డ్రగ్స్, తాయిలాలు, ఇతర వస్తువుల తరలింపుపై నిఘా పెట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. నేడు జరుగుతున్న ఈ ఓటింగ్‌లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
రాబోయే ఎన్నికల కారణంగా భారతదేశంలో కొత్త కమ్యూనికేషన్ రూల్స్ అమలులోకి రాబోతున్నాయని వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం వైరల్ అవుతూ ఉంది. అన్ని కాల్‌లు రికార్డ్ చేస్తారని.. ఆ రికార్డింగ్‌లు సేవ్ చేస్తారంటూ వైరల్ సందేశం ఉంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతారని కూడా వైరల్ మెసేజీలో తెలిపారు.


 Description: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి.*

01. మీ అన్ని కాల్‌లు రికార్డింగ్ అవుతాయి.

02. అన్ని కాల్ రికార్డింగ్‌లు సేవ్ చేయబడతాయి.

03. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియాలను పర్యవేక్షిస్తారు.

04. తెలియని వారందరికీ తెలియజేయండి.

05. మీ పరికరాలు మినిస్ట్రీ సిస్టమ్‌కి కనెక్ట్ అవుతాయి.

06. ఎవరికీ తప్పుడు సందేశాలు పంపకుండా దయచేసి జాగ్రత్త వహించండి.

07. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మరియు తక్కువ సోషల్ వెబ్ సైట్‌లను ఉపయోగించమని వారికి చెప్పండి.

08. రాజకీయాలు లేదా వర్తమాన వ్యవహారాలపై ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి ఇతర అధికారులపై మీ పోస్ట్ లు లేదా వీడియోలు...మొదలైనవి. పంపవద్దు.

09. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన విషయాలపై సందేశాలు రాయడం లేదా పంపడం నేరం...అలా చేస్తే మిమ్మల్ని వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు.

10. ముందుగా పోలీసులు నోటిఫికేషన్ జారీ చేస్తారు... సైబర్ క్రైమ్ వారు తర్వాత... చర్య తీసుకుంటారు, ఇది చాలా తీవ్రమైనది.

11. దయచేసి మీరందరు గ్రూప్ సభ్యులు మీమీ పరిధిని గుర్తెరిగి అడ్మిషన్లకు సహకరించే విధిగా మీమీ గౄపు లేదా సమూహాలలో వ్యవహరించండి..దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించండి.

12. ఎటువంటి తప్పుడు సందేశాన్ని పంపకుండా జాగ్రత్త వహించండి మరియు అందరికీ తెలియజేసి జాగ్రత్త వహించండి.

13. దయచేసి దీన్ని భాగస్వామ్యం చేయండి..సమూహాలు కొన్నాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి.!

గ్రూపు సభ్యులకు WhatsApp గురించి ముఖ్యమైన సమాచారం...క్రింది విధంగా..

వాట్సాప్‌లో సమాచారం

01. Description: = సందేశం పంపబడింది.

02. Description: Description: = సందేశం బట్వాడా చేయబడింది..

03. రెండు నీలం Description: Description: = సందేశం చదవబడింది..

04. మూడు నీలం Description: Description: Description: = ప్రభుత్వం సందేశాన్ని నోట్ చేసింది.

05. రెండు నీలం మరియు ఒక ఎరుపు Description: Description: Description: = ప్రభుత్వం మీపై చర్య తీసుకోవచ్చు..

06. ఒక నీలం మరియు రెండు ఎరుపు = ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తోంది

07. తీన్ లాల్ Description: Description: Description: = ప్రభుత్వం మీపై చర్యను ప్రారంభించింది మరియు త్వరలో మీకు కోర్టు సమన్లు అందుతాయి..బాధ్యతగల పౌరుడిగా ఉండండి మరియు మీ స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోండి..

Description: *Team Work means more no of "WE"

ఈ సందేశాన్ని ట్విట్టర్‌లో కొంతమంది వినియోగదారులు కూడా షేర్ చేస్తున్నారు.
దీన్ని ఓ వెబ్‌సైట్ లో కూడా ప్రచురించారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ప్రచారంలో ఉన్న మెసేజీ ఒక బూటకం.

తెలుగుపోస్ట్ వైరల్ మెసేజీ గురించి తెలుసుకోవడం కోసం సెర్చ్ చేసింది. ఆ సందేశం 2020 సంవత్సరం నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మేము కనుగొన్నాము.

కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రభుత్వ ఏజెన్సీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో, మేము సందేశానికి సంబంధించిన ఏ ప్రామాణికమైన సమాచారాన్ని కనుగొనలేకపోయాం. PIB ఫాక్ట్ చెక్ Facebook హ్యాండిల్ 2020 సంవత్సరంలోనే వైరల్ సందేశం బూటకమని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

PIB సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో “అలాంటి వాదన అంతా బూటకం. ఇలాంటి వాట్సాప్ మెసేజ్‌లు నమ్మొద్దు. ఇలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ఎలాంటి తప్పుడు వార్తలు/తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్/సర్క్యులేట్ చేయవద్దని.. వార్తలను ప్రామాణికమైన మూలాల నుండి వచ్చినవి మాత్రమే నమ్మండి. " అని ఉంది.
Full View
ఇండియా టీవీ న్యూస్ కూడా వైరల్ సందేశంలో ఎలాంటి నిజం లేదని.. అది బూటకమని ధృవీకరించింది. WhatsApp ట్రిపుల్ టిక్‌ల విషయానికొస్తే, ఒకే టిక్ సందేశం పంపడాన్ని సూచిస్తుంది, డబుల్ టిక్‌లు మెసేజీ డెలివరీని సూచిస్తాయి.. డబుల్ బ్లూ టిక్‌లు సందేశాన్ని అవతలి వాళ్లు చదివినట్లు సూచిస్తాయి. కాల్ మానిటరింగ్ కోసం ట్రిపుల్ టిక్‌లను ప్రవేశపెట్టే ప్రస్తావన వాట్సాప్ సంస్థ చేయలేదు.
ఈ బూటకపు సందేశం గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో కూడా ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న మెసేజీ ఒక బూటకం. కేంద్ర ప్రభుత్వం లేదా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను జారీ చేయలేదు.
Claim :  పార్లమెంట్ ఎన్నికల కారణంగా భారతదేశంలో కొత్త కమ్యూనికేషన్ రూల్స్ అమలులోకి వచ్చాయి
Claimed By :  Whatsapp Users
Fact Check :  False
Tags:    

Similar News