Cyber Crime : సైబర్ వలలో రిటైర్డ్ జడ్జి.. 1.60 కోట్లకు టోకరా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
cyberabad cyber crime news
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. వారి వలలో ఉన్నత చదువులు చదివిన వారు సయితం పడుతున్నారు. తాజాగా రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్ అయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆయన నుంచి . 1.66 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జికి సైబర్ నేరగాళ్ల మోసం తప్పలేదు. వీడియో కాల్ చేసి తాము సీబీఐ అధికారులమని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ అంటూవిచారణ జరుగుతుందని చెప్పి ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఆధార్ కు లింక్ అయి ఉన్న రెండు మొబైల్ నెంబర్లు మహిళలకు అభ్యంతర కాల్స్ చేస్తున్నారని మాజీ జడ్జిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు, బెంగళూరులోని ఇందిరానగర్ లో మీపై కేసు నమోదు అయిందని భయభ్రాంతులకు గురిచేశారు.