online trading scam:మాదీనగుడలో ఆన్లైన్ మోసానికి బలి అయిన వృద్ధురాలు
₹35 లక్షలు పోయి పోలీసులకు ఫిర్యాదు వాట్సాప్ గ్రూపులోకి చేర్చి మోసం
హైదరాబాద్: మాదీనగుడకు చెందిన 80 ఏళ్ల పదవీ విరమణ పొందిన మహిళను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసగాళ్లు రూ.35,00,500 కాజేశారు. ఎసీస్ట్రేడ్ (ACSTRADE) పేరుతో నకిలీ యాప్ రూపొందించి ఆమెను నమ్మించి డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వాట్సాప్ గ్రూపులోకి చేర్చి మోసం
అక్టోబర్ 30న బి.రామాదేవి (భర్త ప్రథాప్) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 25న మనీషా గుప్తా అనే మహిళ వాట్సాప్ గ్రూపులోకి చేర్చిందని, ఆమెతో పాటు ఆరవ్ గుప్తా, మీనా జోషి లు “అప్పర్ సర్క్యూట్ స్టాక్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి’’ అంటూ నమ్మించారని ఫిర్యాదులో తెలిపారు.
నకిలీ యాప్, బదిలీల వల
ఆరవ్ గుప్తా “చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్’’ అంటూ పరిచయం చేసుకుని, రామాదేవిని రిఫరల్ లింక్ ద్వారా ACSTRADE యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. మొదట రూ.10 వేల్ని హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి పంపగా, తర్వాత 2025 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 మధ్యలో మొత్తం రూ.35 లక్షలు పలు ఖాతాలకు తరలించిందని తెలిపారు. ప్రతి చెల్లింపును వేరువేరు “చార్జ్ కోడ్’’ పేరుతో చేయమని సూచించారట. పెట్టుబడులపై తప్పుడు లాభాల స్క్రీన్షాట్లు చూపించి, “డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చు’’ అని నమ్మబలికారు.
డబ్బు తీసుకోనివ్వకుండా అదనపు రుసుము డిమాండ్
తర్వాత యాప్లో విత్డ్రా ఆప్షన్ పనిచేయకపోవడంతో మోసపోయానని రామాదేవి గ్రహించింది. ఆమె డబ్బు వెనక్కి అడగగా, “రిలీజ్ ఫీ’’గా రూ.7 లక్షలు చెల్లించాలని గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు. చెల్లించ పోయేసరికి, అన్ని విధాలా సంబంధాలు నిలిపివేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యాప్ నకిలీ ట్రేడింగ్ వెబ్డొమైన్తో లింక్ అయి ఉందని, అన్ని కమ్యూనికేషన్లు వాట్సాప్ ద్వారానే జరిగాయని తెలిపారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, మోసగాళ్లను, సంబంధిత బ్యాంకు ఖాతాలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.