Cyber Crime : హైదరాబాద్ నగరంలో సైబర్ మోసం.. కూరగాయలు కొనేందుకు?
హైదరాబాద్ నగరాన్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. వాళ్లు వీళ్లు అనేది లేదు.. ఎవరి నుంచైనా దోచుకునేందుకు వివిధ రకాల వ్యూహాలతో ముందుకు వస్తున్నారు
హైదరాబాద్ నగరాన్ని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. వాళ్లు వీళ్లు అనేది లేదు.. ఎవరి నుంచైనా దోచుకునేందుకు వివిధ రకాల వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పై ప్రచారం జోరుగా జరుగుతుండటంతో దానిని పక్కన పెట్టి ప్రత్యామ్నాయం వైపు సైబర్ నేరగాళ్లు దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. తాజాగా హైదరాబాద్ లో యూసుఫ్గూడకు చెందిన ఒక యువకుడు ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేస్తూ మోసానికి గురయ్యాడు. సెప్టెంబర్ 30వ తేదీన తక్కువ ధరలు చూపిన తెలియని వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికే ఆన్లైన్ గ్రోసరీ, ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్కేర్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న వ్యక్తి ఫోన్ చేసి పెండింగ్ చెల్లింపు చేయాలని కోరాడు. అతను వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్ పంపాడు. బాధితుడు దాన్ని ఇన్స్టాల్ చేసి 360 రూపాయలు చెల్లించాడు.