గుండెపోటుతో భర్త మృతి.. భార్య చేసిన పనికి కన్నీళ్లు ఆగవు

ఇద్దరూ ఢిల్లీలోని జూ సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ అభిషేక్ కు గుండెపోటు వచ్చింది

Update: 2024-02-27 12:57 GMT

చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్లకే గుండెపోటు వస్తూ ఉండడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా మన కళ్ల ముందు ఉన్న వ్యక్తులు క్షణాల్లో కుప్పకూలిపోతూ ఉండడం.. ప్రాణాలు వదిలేయడం చూసి తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి ఘటనే ఓ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడని తెలుసుకున్న మహిళ.. తన ప్రాణాలను కూడా తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన ప్రాపర్టీ డీలర్ అభిషేక్ అహ్లూవాలియాకు అంజలితో ఇటీవలే వివాహం జరిగింది. ఇద్దరూ ఢిల్లీలోని జూ సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ అభిషేక్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అంజలి తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని సంప్రదించి అభిషేక్ ను హాస్పిటల్ కు తరలించింది. హాస్పిటల్ కు చేరుకునే లోపే అభిషేక్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటుతో అభిషేక్ చనిపోయినట్లు తేల్చారు. అభిషేక్ వయసు 25 సంవత్సరాలే. కలిసి జీవితం గడపాలని అనుకున్న ఆ జంట జీవితంలో ఇదొక హఠాత్ పరిణామం. అభిషేక్ మృతదేహాన్ని ఘజియాబాద్ లోని వైశాలి సెక్టర్ 3లోని వారి నివాసానికి తీసుకువచ్చారు. ఇంతలో అంజలి ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక అంజలి ఆత్మహత్యకు యత్నించింది. ఏడో అంతస్తులోని తమ అపార్ట్ మెంట్ బాల్కనీలోకి వెళ్లి కిందకు దూకేసింది. ఈ ఘటనలో అంజలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అంజలి చనిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోనూ, ఇరు కుటుంబాలలోనూ విషాదం నెలకొంది.


Tags:    

Similar News