హైదరాబాద్ లో మరో అత్యాచార ఘటన

దిల్‌సుఖ్‌నగర్‌లో రెండేళ్లుగా ఓ హౌస్ కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఇటీవల ఆమె నైట్ డ్యూటీ చేస్తున్న క్రమంలో

Update: 2022-09-24 05:18 GMT

హైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. అంబర్‌పేట్‌కు చెందిన మహిళ(43) దిల్‌సుఖ్‌నగర్‌లో రెండేళ్లుగా ఓ హౌస్ కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఇటీవల ఆమె నైట్ డ్యూటీ చేస్తున్న క్రమంలో ఆమెపై వార్డు బాయ్ సందీప్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో ఎవరూ లేని సమయం చూసి దారుణానికి పాల్పడ్డాడు. మహిళను గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. మహిళ శుక్రవారం మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం:
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న ఓ పదేళ్ల మైనర్ బాలికపై బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఇటీవల అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్ బాలికను ప్రశ్నించగా.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిపింది. బాలిక బంధువులు బీహార్ యువకులను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Tags:    

Similar News