శంషాబాద్‌లో మ‌హిళ‌ దారుణ హ‌త్య

శంషాబాద్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. స్థానిక శ్రీనివాస్ నగర్ కాలనీలో గుర్తుతెలియని మహిళ

Update: 2023-08-11 03:34 GMT

శంషాబాద్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. స్థానిక శ్రీనివాస్ నగర్ కాలనీలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. పూర్తిగా కాలిపోయిన మహిళ మృత దేహం క‌న‌ప‌డ‌టంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు.. క్లూస్ టీమ్‌తో స‌హా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు త‌నిఖీ చేశారు. అయితే సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక వ్యక్తి పల్సర్ బైక్‌పై అక్కడకు వచ్చి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తి.. సాయి ఎన్ క్లేవ్ లోని ఖాళీ ఇళ్ల‌ స్థలాల మధ్య మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పం టించాడు. మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే శంషాబాద్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.


Tags:    

Similar News