డబుల్ మర్డర్.. మహిళ, మనవరాలు తమన్నా దారుణ హత్య

రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం జి బ్లాక్ లో ఉంటోంది. మాజీ పోలీసు భార్య, 12 ఏళ్ల మనవరాలు

Update: 2022-08-10 07:27 GMT

మీరట్‌లోని ఇంటిలో ఒక మహిళ, ఆమె మనవరాలు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు కత్తితో గొంతు కోసి వారిని చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీరట్‌లోని నౌచండి ప్రాంతంలోని డి బ్లాక్‌లో కౌశల్ సిరోహి (65), ఆమె మనవరాలు తమన్నా (12) దారుణ హత్యకు గురయ్యారు. కసుహల్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ రతన్ సింగ్ భార్యనే కౌశల్ సిరోహి. ఆయన రెండు నెలల క్రితం క్యాన్సర్‌తో మరణించాడు. సోమవారం ఉదయం ఇంటి పనిమనిషి వచ్చే సమయానికే తలుపులు తెరిచి ఉండడంతో జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి. లోపలికి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. ఇంట్లో మొత్తం రక్తం కనిపించింది. రాత్రి ఇంట్లోకి ఎవరో ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ బృందాలతో క్లూలు సేకరిస్తూ ఉన్నారు.


రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం జి బ్లాక్ లో ఉంటోంది. మాజీ పోలీసు భార్య, 12 ఏళ్ల మనవరాలు కూడా ఇంట్లో ఉన్నారు. ఇరుగుపొరుగు వారి ప్రకారం.. ఉదయం ఇంటి నుండి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అధికారులు ఇంట్లో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. దోపిడీ యత్నంలో భాగంగా దుండగులు వీరిద్దరినీ హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోష్ కాలనీలో జరిగిన జంట హత్యలు ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన మొదలైంది.


Tags:    

Similar News