సాయం చేస్తామని కారులో మహిళ, ఆమె కూతుర్ని ఎక్కించుకున్నారు.. దారుణం

మహిళ, తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా, రాత్రి సమయంలో ఓ కారు వారి ముందు ఆగింది.

Update: 2022-06-27 10:45 GMT

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సాయం పేరుతో మానవ మృగాలు ఓ తల్లీ, ఆమె ఆరేళ్ల కుమార్తెపై వెళుతున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి, అతని స్నేహితులు కదులుతున్న కారులో ఒక మహిళ.. ఆమె ఆరేళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని రూర్కీలో చోటుచేసుకుంది. పిరాన్ కలియార్ నుండి తన 6 ఏళ్ల కుమార్తెతో ప్రయాణిస్తున్న మహిళ, రాత్రి సమయంలో సోను అనే వ్యక్తి లిఫ్ట్ ఆఫర్‌ను అంగీకరించినట్లు పోలీసులు తమ నివేదికలో తెలిపారు. అప్పటికే ఆ వ్యక్తి స్నేహితులు కొందరు కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ తెలిపారు. దుండగులపై దాఖలైన ఫిర్యాదు ప్రకారం, సోను, అతని సహచరులు కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి కాలువ దగ్గర పడేశారు. అయితే ఆ మహిళ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనకు జరిగిన దారుణాన్ని వివరించింది.

మహిళ, తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా, రాత్రి సమయంలో ఓ కారు వారి ముందు ఆగింది. కారు నడుపుతున్న సోనూ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో వారు కారులో ఎక్కారు. అదే కారులో సోనూ స్నేహితులు కూడా ఉన్నారు. అనంతరం కారులో ఉన్నవారు ఆ మహిళతోపాటు, చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఓ కాలువ వద్ద దింపేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో బాధిత మహిళ, తన కుమార్తెతో కలసి పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని చెప్పింది. ఇద్దరినీ రూర్కీ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పరీక్షలో ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. కారులో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News