ప్రియుడితో కలిసి భర్తను హత్య.. చివరికి ఏమయ్యారంటే..!

ప్రేమ వ్యవహారంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

Update: 2022-07-23 07:35 GMT

ఫరీదాబాద్‌లోని నంగ్లా ఎన్‌క్లేవ్‌లో పాల్వాల్‌లోని జటోలి నివాసి దేవేంద్ర (34)ను గొంతు కోసి హత్య చేశారు. ప్రేమ వ్యవహారంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర భార్య, ఆమె ప్రియుడు ఇమామ్ ఖురేషీ దారుణంగా హత్య చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని పార్వతీయ కాలనీలో గురువారం (జూలై 21)- శుక్రవారం (జూలై 22) మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. దేవేంద్ర ఒక వైల్డింగ్ షాపులో పనిచేసేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవేంద్రను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో నింపి తన ఇంటి బాత్‌రూమ్‌లో దాచాడని పోలీసులు తెలిపారు. దేవేంద్ర మృతదేహాన్ని ఇమామ్ ఖురేషీ ఇంటి నుంచి జూలై 22 2022 (శుక్రవారం) స్వాధీనం చేసుకున్నారు.

దేవేంద్ర మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత.. ఈ హత్యకు వ్యతిరేకంగా అనేక మంది హిందూ సంఘాల సభ్యులు వీధుల్లోకి వచ్చి.. నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు ఇమామ్ ఖురేషి మృతుడి భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని డీసీపీ తెలిపారు. నిందితుడితో కలిసి దేవేంద్ర భార్య భర్తను అడ్డు తొలగించుకోవాలని.. హత్యకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. వీరిద్దరూ దేవేంద్రను హత్య చేసి, అతని మృతదేహాన్ని గోనె సంచిలో నింపి ఇమామ్ ఖురేషీ ఇంట్లోని బాత్‌రూమ్‌లో దాచారు. ఇద్దరూ మృతదేహాన్ని పారవేసేందుకు ప్లాన్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కస్టడీలో నేరం అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు.


Tags:    

Similar News