ఆగిఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బొలెరో.. 7గురు దుర్మరణం

కరెంట్ షాక్ కు గురైన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే..

Update: 2023-06-30 05:41 GMT

uttarpradesh crime news

గురువారం (జూన్ 30) అర్థరాత్రి.. రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బొలెరో ఢీ కొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లా పరాయియాదయీ గ్రామానికి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కరెంట్ షాక్ కు గురైన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. తీవ్రగాయాలపాలైన వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బొలెరో లో మొత్తం 8 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చి ట్రక్కును ఢీ కొట్టడంతో.. బొలెరో వాహనం నుజ్జునుజ్జైనట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి.. మృతుల బంధువులకు సమాచారం అందించారు.


Tags:    

Similar News