అమానుషం.. పసికందును పై నుంచి విసిరేసిన తల్లి

అప్పుడే పుట్టిన బిడ్డను అపార్ట్ మెంట్ పై నుండి విసిరేసింది. తూర్పు ఢిల్లీలోని కొండ్లీలో ఉన్న జై అంబే అపార్ట్ మెంట్స్

Update: 2023-01-10 11:04 GMT

just born baby thrown from window

మానవ విలువలు రోజురోజుకూ మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఒక వైపు.. కన్న బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రుల తీరు మరో వైపు.. ఇలా మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ఘోరాలు, దారుణాలు జరుగుతున్నాయి. మూఢనమ్మకాలతో బిడ్డలను పొట్టన పెట్టుకునేవారు కొందరైతే.. దంపతుల మధ్య తగాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు మరికొందరు. పెళ్లికాకుండానే తల్లులవుతున్న యువతులు.. బొడ్డుపేగు ఆరకుండానే పసికందులను అమానుషంగా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి అమానుష ఘటనొకటి తూర్పు ఢిల్లీలో వెలుగుచూసింది.

అమ్మతనానికే మచ్చ తచ్చే పనిచేసిందో ఇరవై ఏళ్ళ యువతి. తన కడుపున పుట్టిన చిన్నారి అన్న మమకారం.. ఆవగింజంతైనా లేకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డను అపార్ట్ మెంట్ పై నుండి విసిరేసింది. తూర్పు ఢిల్లీలోని కొండ్లీలో ఉన్న జై అంబే అపార్ట్ మెంట్స్ లో ఈ ఘటన జరిగింది. ఓ యువతి టాయిలెట్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పెళ్లికాలేదు. పెళ్లి అవకుండానే తల్లైందన్న విషయం నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని, అవమానాలు ఎదుర్కోవాలని భావించింది. ఆ భయంతో పసికందును టాయిలెట్ కిటికీలో నుండి విసిరేసింది. పసికందును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. బిడ్డ కింద పడిన తీరును పరిశీలించారు. ఆ అపార్ట్ మెంట్ లో అనుమాస్పదంగా కనిపించిన ఫ్లాట్లను తనిఖీ చేయగా.. సదరు యువతి ఫ్లాట్ లో రక్తపు మరకలు నిపించాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించింది. యువతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News